హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై.సతీష్ రెడ్డి వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్పై అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టడంతో ఎంపీపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ..చీప్ లిక్కర్ పార్టీ అయిన బీజేపీ మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పసుపు రైతులను నిండా ముంచి, బాండు పేపర్లు ఇచ్చి మోసం చేసిన మోసగాడు ఎంపీ అర్వింద్ అని వివమర్శించారు. నీకు దమ్ముంటే పసుపు బోర్డు గురించి మాట్లాడు. మీ పార్టీకి దమ్ముంటే పార్లమెంట్లో లిక్కర్ మీద మాట్లాడండని సవాల్ విసిరారు.
దేశం మొత్తం లిక్కర్ బ్యాన్ చేయండి. అంతేకానీ..14 ఏండ్లు కష్టపడి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్పై ఇలాంటి చిల్లర పోస్టులు పెడుతున్న అర్వింద్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అంతేకాదు..24 గంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే అర్వింద్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఎక్కడ తిరగకుండా అడుగడుగునా అడ్డుకుంటామంటామన్నారు.