చర్లపల్లి, జనవరి 12 : దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తిలో చర్లపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలువడం అభినందనీయమని ఐఓసీఎల్ సిటీ జనరల్ మేనేజర్ రవికుమార్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఓసీఎల్లో పెట్రోల్ ఉత్పత్తి, ఎగుమతిలో ప్రథమ స్థానం దక్కించుకోవడం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ ట్యాంకర్స్ ఓనర్స్ అసోసియేషన్ యజమానులు, డ్రైవర్లకు ప్రత్యేక జ్ఞాపికలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, ట్యాంకర్స్ యజమానులు, డ్రైవర్ల భాగస్వామ్యంతో ఈ ఘనత సాధించామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ డీజీఎంలు శర్మ, ఆంజనేయ వరప్రసాద్, సిటీ మేనేజర్ కిరణ్కుమార్, సేఫ్టీ అధికారి శ్రీకాంత్, ట్రాన్స్పోర్ట్ మేనేజర్లు సుజన, అజయ్కుమార్, ప్లానింగ్ అధికారి మధురా, ఐఓసీఎల్ ట్యాంక్, ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ సలహాదారులు కడియాల జనార్దన్, బుచ్చయ్య, అధ్యక్ష, కార్యదర్శులు బాలా గౌడ్, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.