ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 28 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ కోర్సుల నాలుగు, అయిదో సెమిస్టర్ మెయిన్, సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 31వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష కేంద్రం, సమయంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చన్నారు.