Ronald Ross | సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : ఎర్లీబర్డ్ పథకాన్ని వినియోగించుకొని 5 శాతం రాయితీ పొందాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపునకు సంబంధించి ఎర్లీబర్డ్ పథకాన్ని ఆమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.230 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. గ్రేటర్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత సమయంలో ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందాలని కమిషనర్ పేర్కొన్నారు.