హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే దుండగులు ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్పేట్ సహా మొత్తం ఆరు చోట్ల దొంగలు గొలుసులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. దుండగుల కోసం హైదరాబాద్లోని అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. గొలుసులతోపాటు ఓ బైక్ను కూడా దొంగిలించినట్లు పోలీసులు భావిస్తున్నారు.