చాంద్రాయణగుట్ట,నవంబర్ 28 : లలితాబాగ్ హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిలో బస్తీల ప్రజలు భాగ్యస్వాములు కావాలని సంఘ సేవకులు కోరారు. శ్మశాన వాటికలో అపరిశుభ్రత వాతావరణం నెలకొనడంతో పాటు సమాధులు కనిపించకుండా కలుపు మొక్కలు పెరగడం, కూల్చివేసిన ఇండ్ల మట్టి, ఇతర సామాగ్రి తీసుకువచ్చి శ్మశాన వాటికలో వేస్తుండటంతో శ్మశాన వాటిక డంపింగ్ యార్డుగా మారింది. దీంతో యేడాది కాలంగా ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రజలు ఆదివారం శ్మశాన వాటిక వద్ద సమావేశం నిర్వహించారు. సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో లలితాబాగ్ దేవాలయం చైర్మన్ పోతర్ల రమేశ్ యాదవ్ స్థానికులు అశోక్ కుమార్, ఎం.శ్రీనివాస్, ఎం.దశరథ, జి.నర్సింగ్రావు, రాజేందర్, విక్రమ్, మాణిక్రావు, జి.మల్లేశ్, వై.మల్లేశ్, బాబురావు, బి.మారుతి, సాయిరాం పటేల్, సంఘ సేవకులు మీనా పాల్గొన్నారు.