కాచిగూడ : చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ చోరీ అయిన ఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణమూర్తి (45) ప్రైవేటు ఉద్యోగి. బెంగళూర్కు వెళ్లడానికి శనివారం రాత్రి కాచిగూడ రైల్వేస్టేషన్కు వచ్చాడు.
రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం-2లో తన సెల్ఫోన్ను చార్జింగ్ పెట్టాడు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ను దొంగిలించారు. వెంటనే కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు.