అబిడ్స్, జూలై 29 : మాజీ మంత్రి మూల ముఖేశ్ గౌడ్ సంస్మరణ సభను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆయన తనయుడు ఎం. విక్రంగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ముఖేశ్ గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంస్మరణ సభలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మధు యాష్కిగౌడ్, మందడి అంజన్కుమార్ యాదవ్, బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్రెడ్డి, సురేశ్ రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ పాల్గొన్నారు.