అమీర్పేట్, డిసెంబర 24 : సనత్నగర్ డివిజన్ బీకేగూడలోని క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ 50 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా జరిగిన ప్రార్థనల్లో పాల్గొని చర్చి వ్యవస్థాపకుడు పాస్టర్ జాన్ వెస్లీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరిగ్గా 50 సంవత్సరాల క్రితం పాస్టర్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ క్రిస్టియన్ ఫెలోషిప్ సెంటర్ క్రమంగా విస్తరిస్తూ తెలుగు రాష్ర్టాల్లో 31 కేంద్రాలు నెలకొల్పుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కేంద్రాల ద్వారా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవలకు కూడా పెద్దపీట వేస్తుండటం అభినందనీయమన్నారు. జాన్ వెస్లీ సామాజిక సేవలకు గుర్తింపుగా త్వరలోనే సావనీర్ను రూపొందించనున్నామని చర్చి కేర్ టేకర్ శామ్యూల్ వెస్లీ ప్రకటించడం పై ఆనందం వ్యక్తం చేశారు. వేడుకలను పురస్కరించుకుని చర్చి పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బీఆర్ఎస్ సనత్నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్రెడ్డి, పాస్టర్లు సంజయ్, కుమార్, సైమన్, బీఆర్ఎస్ సనత్నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్రెడ్డి, షాబాద్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
కేక్కట్ చేసిన మంత్రి తలసాని…
తెలంగాణ ప్రభుత్వం తరపున అమీర్పేట్ వివేకానంద కమ్యూనిటీ హాలులో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ శేషుకుమారితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో క్రిస్టియన్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ప్రతినిధి పాస్టర్ సైమన్ పీటర్, చర్చి ఆఫ్ ది లివింగ్ గాడ్ పాస్టర్ శామ్యూల్ ప్రసాద్, రెహబోత్ ప్రేయర్ హౌస్ పాస్టర్ సురేశ్ మనోహరన్, బాపూనగర్లోని జీసెస్ ష్రైన్ మినిస్ట్రీ పాస్టర్ సుదర్శన్ రావు, షాలోమ్ రివైవల్ వర్షిప్ సెంటర్ పాస్టర్ షాలోమ్ ప్రసాద్, బ్రదర్ డేవిడ్ సూరజ్లతో పాటు బీఆర్ఎస్ నాయకులు హనుమంతరావు, సంతోష్ మణికుమార్, అశోక్యాదవ్, నర్సింహ, సత్యనారాయణ, సత్యనారాయణయాదవ్ పాల్గొన్నారు.