కొండాపూర్, మార్చి 17: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు ఈ నెల 24, 25వ తేదీల్లో వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం మాదాపూర్లోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు వారియర్స్ టీమ్తో కలిసి సీసీఎల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఇందూరి, డైరెక్టర్ తిరుమల్రెడ్డి పాల్గొని తెలుగు వారియర్స్ సెమీ ఫైనల్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎండీ విష్ణువర్ధన్ మాట్లాడుతూ 24న కర్ణాటక బుల్డోజర్స్, వాసవి తెలుగు వారియర్స్, భోజ్పురి దబాంగ్స్, ముంబై జట్లు సెమీఫైనల్స్లో తలపడనున్నట్లు వెల్లడించారు. 25న ఫైనల్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు, వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ యర్రం, డైరెక్టర్స్ అభిషేక్ చందా, సౌమ్య చందా తదితరులు పాల్గొన్నారు.