క్యాసినోలన్నీ లీగలే..
ఈడీకి సహకరిస్తా : చికోటి ప్రవీణ్
సైదాబాద్, జూలై 28: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు, నోటీసుల అంశంపై మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్కుమార్ స్పందించారు. గురువారం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.
నేను సామాన్య వ్యక్తిని, లీగల్ వ్యాపారమే చేశాను.. ఈడీ ఇచ్చిన నోటీసులకు జవాబు ఇస్తాను.. అంటూ చెప్పారు. ఈడీ అధికారులు సాధారణ సోదాల్లో భాగంగానే తనిఖీలు చేశారని, ఈడీ ఇచ్చిన నోటీసులకు సోమవారం హాజరై అన్ని విషయాలను చెబుతానని తెలిపారు. తాను నిర్వహించిన క్యాసినోలు అన్నీ లీగలే అని, నేపాల్, గోవా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన క్యాసినోలు లీగల్ అని ఆయన పేర్కొన్నారు.