మలక్పేట, జనవరి 1 : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని శనివారం రాత్రి మలక్పేట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ చాలా మంది పట్టుబడ్డారు.
దిల్సుఖ్నగర్ చౌరస్తా , పీవీఆర్ షాపింగ్ మాల్ వద్ద నిర్వహించిన డ్రైవ్ తనిఖీల్లో 144 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, వారిపై కేసులు నమోదు చేసినట్లు మలక్పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి.జ్యోత్స్న తెలిపారు. రాత్రి 11 నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు తనిఖీలు నిర్వహించామన్నారు.