బంజారాహిల్స్, ఏప్రిల్ 8: నగరం నడిబొడ్డు ఉన్న సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోద యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్పేట మండలం సర్వే నెంబర్ 403/పీలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెం 2లో టీఎస్ నెంబర్ 1పి, బ్లాక్ హెచ్, వార్డు 9లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది.
ఈ స్థలానికి వెనకాల జూబ్లీ హిల్స్ రోడ్ నెం 8లోని సత్వా ఎన్క్లేవ్లో జీహెచ్ఎం సీ ట్రీ పార్కును అనుకుని గుంటి శ్రీధర్రావు అనే వ్యాపారి ఇంటి నిర్మాణం చేపట్టారు. కాగా తన ప్లాటును ఆనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వస్థలంపై కన్నేసిన శ్రీధర్రావు గత కొన్నిరోజులుగా బండరా ళ్లను తొలగించి చదును చేశారు. భవన నిర్మాణసా మగ్రిని తెచ్చి అక్కడ వేయడంతో పాటు ఏకంగా భారీ షెడ్ల నిర్మాణం చేపట్టారు.
ఈ స్థలంలో ఆక్రమ ణలను తొలగించాలంటూ రెవెన్యూ సిబ్బంది హెచ్చ రికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో పాటు తనకు అనేకమంది రాజకీయ ప్రముఖులతో పరిచ యాలు ఉన్నాయని, నా జోలికి వస్తే మీరు ఇబ్బం దులు పడతారంటూ దబాయిస్తున్నాడు.ఈ క్రమం లో సోమవారంరాత్రి ప్రభుత్వ స్థలంలో హిటాచీ యంత్రంతో పనులు చేస్తుండడంతో సమాచారం అందుకున్న సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరామ్, షేక్ పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి అక్కడకు చేరు కుని ఆ స్థలంలో వెలిసిన ఆక్రమణలను తొలగించి నిర్మాణ సామగ్రిని సీజ్ చేశారు.
ప్రభు త్వ స్థలంలో పనులు చేస్తున్న హిటాచీ యంత్రాన్ని సీజ్ చేశారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని సర్వే చేయ గా 288 గజాలుగా తేలింది. ఈ స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.12కోట్లు ఉండవచ్చని అధికా రులు తెలిపారు. గత కొంతకాలంగా ప్రభు త్వ స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నట్లు గుర్తించి హెచ్చ రించినా పట్టించుకోకపోవడంతో వ్యాపారి గుంటి శ్రీధర్రావు తో పాటు కాంట్రాక్టర్ నర్సింగ్రావుపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్ అనితారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళ వారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం స్థలంలో ప్రభు త్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.