హైదరాబాద్ : మాదాపూర్లోని ఓ హోటల్లో బుధవారం రాత్రి కొంతమంది యువకులు హంగామా సృష్టించారు. చిన్న సమస్య కారణంగా హోటల్ సిబ్బందికి, యువకుల మధ్య వివాదం తలెత్తింది. యువకులు మరింత రెచ్చిపోయారు. హోటల్లోని ఫర్నీచర్ను ఎత్తేశారు. హోటల్ సిబ్బందిని చంపేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హోటల్లో హంగామా సృష్టించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్ మాదాపూర్లోని ఓ హోటల్లో బుధవారం రాత్రి కొంత మంది యువకులు హంగామా సృష్టించారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. సిబ్బందిని చంపేస్తామని బెదిరించారు. pic.twitter.com/wAlkiUTxvg
— Namasthe Telangana (@ntdailyonline) March 3, 2022