సుల్తాన్బజార్, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంజీబీఎస్లోని కార్గో, కొరియర్ పార్సిల్ కౌంటర్లో మిగిలిపోయిన వస్తువులకు ఈనెల 19న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కార్గో, కొరియర్ పార్సిల్ కౌంటర్లలో చాలాకాలంగా ఎలక్ట్రికల్, ఐరన్, సెల్ఫోన్ స్పేర్ పార్ట్స్, బట్టలు, ప్లాస్టిక్, బైక్ అండ్ కార్ స్పేర్ పార్ట్స్, మెడికల్ సామగ్రి పడి ఉన్నదని, వాటిని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఆ వస్తువులను వేలం వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 19న ఎంజీబీఎస్లోని గ్యారేజ్ ఆవరణలో ఉదయం పది గంటలకు ఈ వేలం పాట ప్రారంభమవుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారానికి 9154298865, 9391778825లో సంప్రదించాలని సూచించారు.