Hyderabad | హైదరాబాద్ : నానక్రామ్గూడ పరిధిలో శనివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే ఉన్న సైక్లింగ్ ట్రాక్పై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పాదచారులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.