సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని గ్రూపు సీఈఓ ఏమన్ ఇజ్జట్తో పాటు కంపెనీ ప్రతినిధుల బృందం టీహబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస రావు వారితో సమావేశమయ్యారు.
టీ హబ్ కేంద్రంగా ప్రారంభమైన టెక్నాలజీ స్టార్టప్ల పనితీరును వారికి ప్రత్యేకంగా వివరించారు. స్టార్టప్లకు కార్పొరేట్ సంస్థల సహకారం అవసరం ఉన్నదని, అదేవిధంగా సరికొత్త ఆలోచనలతో ప్రారంభించిన స్టార్టప్ల వ్యవస్థాపకులకు మార్గదర్శకులు (మెంటార్స్)గా పనిచేయాలని కోరారు.