సికింద్రాబాద్ : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపాలపురం ఏసీపీ సుధీర్ కథనం ప్రకారం సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన మహ్మద్ నదీం (21) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
ఈనెల 7న వారాసిగూడ ఏరియాలో గంజాయితో సంచరిస్తుండగా చిలకలగూడ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా వారాసిగూడలో గంజాయి విక్రయిస్తున్నాడని వెల్లడైంది. నిందితుడి నుంచి రూ. 20 వేల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై మార్కెట్, మహాంకాళి, ఆసీఫ్నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదైనట్లు చెప్పారు. మీడియా సమావేశంలో చిలకలగూడ సీఐ నరేష్, డీఐ నాగేశ్వర్రావులు పాల్గొన్నారు.