మల్కాజిగిరి, నవంబర్ 16: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్ సర్కిల్, నేరేడ్మెట్, మల్కాజిగిరి, మౌలాలి డివిజన్లలో గురువారం పాదయాత్ర చేసి సమావేశాలలో అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వన్ని వర్గాల సంక్షేమ కోసం మేనిఫెస్టోను అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటికి, విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అప్పట్లో సీఎం కేసీఆర్ ఎన్నికల వాగ్దానంలో ఇంటింటికి నల్లా కనెక్షన్, నిరంతం విద్యుత్ సరఫరా, రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీనీ నేరవేర్చారని అన్నారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడి పస్తులు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సమస్యలు పునరావృతం అవుతాయని అన్నారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలో ప్రశ్నిస్తానని గెలిచిన కాంగ్రెస్ నాయకుడు మల్కాజిగిరి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. మీ కోసం దుండిగల్లోని అరుంధతి దవాఖానలో ఉచితంగా వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు దవాఖానకు వెళ్లి అప్పుల పాలవొద్దన్నారు. ప్రజల పూర్తి రక్షణ, భరోసా కోసం బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా కిశోర్, నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి, నిర్మలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.