సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మోటారు వాహనాల పన్ను చెల్లించకుండా రాకపోకలు సాగించే వాహనాలను సీజ్ చేయడంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పన్ను చెల్లించని వాహనాలను గుర్తించి, సదరు యజమానులపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా 90 వాహనాలను ఇప్పటి వరకు సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. త్రైమాసిక పన్నులు మీసేవ, ఈసేవలో చెల్లించాలని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే వాహనం జప్తు చేశాక.. తిరిగి ఇవ్వడానికి 200 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
జరభద్రం.. లైసెన్స్లు రద్దు..!
రెండేండ్లలో నగరంలో 8418 డ్రైవింగ్ లైసెన్స్లు రద్దయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ ప్రక్రియపై హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ సుధీర్బాబు గురువారం చర్చించారు. మద్యం సేవించి పదేపదే పట్టుబడుతున్న వారి లైసెన్స్లు రద్దు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారి లైసెన్స్లు రద్దు చేశామని జేటీసీ వివరించారు. 2021లో 2599, 2022లో 5819 లెసెన్స్లు రద్దు చేసినట్టు తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో అత్యధికంగా డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు అవడం విశేషం. ఈ పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు.