సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): మెట్రో స్వాధీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రెండో దశ మెట్రో విస్తరణలో కీలక అడుగు పడింది. మార్చి 31వ తేదీలోపు మెట్రో స్వాధీన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పినా… ఇప్పటి వరకు నిధుల సర్దుబాటుపై స్పష్టత రాలేదు. ఈ టేకోవర్ ప్రక్రియ పూర్తి కావడానికి సర్కారు ఏకంగా రూ. 15వేల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎల్ అండ్ టీకి ఉన్న రూ. 2వేల కోట్ల వాటాను కొనుగోలు చేయాల్సి ఉండగా… మిగిలిన రూ. 13వేల కోట్లు మెట్రోపై ఉన్న అప్పులను సర్కారు చెల్లించాల్సి ఉంటుంది.