Student suspicious death | హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో సీఏ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మియాపూర్లోని గోకుల్ ప్లాట్స్లో అద్దెకు ఉంటున్న సీఏ విద్యార్థి జనార్ధన్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే రూములో ఉరి వేసుకున్నట్టు కనిపించినా ఒంటి నిండా రక్తం ఉండడంతో ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని స్థానికుల అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.