హైదరాబాద్ : జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో దేవాదాయ, జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమ్మవారికి 2.5 కిలోల బంగారంతో బోనం, బంగారు తాపడంతో రుద్రాక్ష మండపం నిర్మాణ పనులు చేపడుతామన్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించే విధంగా రూ.5 కోట్లతో మల్టీ లెవెల్ పార్కింగ్ నూతన భవన నిర్మాణం చేపడుతామన్నారు. మహా పుణ్యక్షేత్రంగా బల్కంపేట అమ్మవారి ఆలయాన్ని తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. అలాగే రూ.50 లక్షలతో 48 షాప్ లతో నూతన కాంప్లెక్స్, రూ.36 లక్షలతో భారీ రేకుల షెడ్డు నిర్మాణ పనులు చేపడుతామన్నారు.