సిటీబ్యూరో, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల ఆన్లైన్ వేలంపై ప్రీ బిడ్ సమావేశాన్ని ఆదివారం (6వ తేదీ) మధ్యాహ్నం టీ హబ్లో నిర్వహిస్తున్నామని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 10న ఆన్లైన్ వేలం నిర్వహిస్తున్న నేపథ్యంలో లేఅవుట్కు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు ఆన్లైన్ వేలం విధానాన్ని వివరించేందుకు, బుద్వేల్ లే అవుట్పై ఔత్సాహిక కొనుగోలుదారులకు ఉన్న సందేహాల నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.