సిటీబ్యూరో, 26 అక్టోబర్ (నమస్తే తెలంగాణ): బీఎస్సీ పారామెడికల్ అనుబంధ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 31న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు నిమ్స్ ఫాకల్టీ డాక్టర్ ఎస్.రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 2021 ఏడాదికిగాను సెప్టెంబర్ 16న నిమ్స్ వర్సిటీ బీఎస్సీ పారామెడికల్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నగరంలోని సనగర్నగర్ ఈఎస్ఐసీ కళాశాలలో ఉదయం 10గంటలకు ప్రవేశపరీక్ష ప్రారరంభమవుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉదయం 8.30గంటలకే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ రిపోర్టు చేయాలని కోరారు. ఈ నెల 28 నుంచి నిమ్స్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్తో లాగిన్ అయి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్టికెట్లు లేకుండా పరీక్షకు అనుమతించేది లేదన్నారు.