సిటీబ్యూరో, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): అవకాశవాదులే కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో చేరుతున్నారని బీఆర్టీయూ ప్రెసిడెంట్ రాంబాబు అన్నారు. జలమండలి ఉద్యోగులతో ఎస్ఆర్ నగర్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జి.రాం బాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు కేటీఆర్, కవిత, పల్లా రాజేశ్వర్రెడ్డి సహకారంతోఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు.
కానీ కొంతమంది అవకాశవాద ఉద్యోగులు కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్లో చేరడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో పీ.జరాజ్, పీ. నారాయణ, అక్తర్, జి.లక్ష్మీనారాయణ, సీ.రాజు, జి.రాంచంద్రారెడ్డి, సీహెచ్ జంగయ్య, ఎస్ శ్రీను, ఎం యల్లమయ్య ఉన్నారు.