MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై శనివారం గ్రేటర్వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పీఎం మోదీ, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ‘బీజేపీ డౌన్ డౌన్’ తెలంగాణ ఉద్యమ తడాఖా చూపిస్తాం’ ‘ఎన్ని కేసులు పెట్టినా బెదిరేదే లేదు’ అంటూ గొంతెత్తారు.
బంజారాహిల్స్, అంబర్పేట, కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, నాంపల్లి, ముషీరాబాద్, మల్కాజిగిరి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరసనలతో హోరెత్తించారు.
నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ, కాంగ్రెస్లు కలిసిపోయాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ తడాఖాను ప్రధాని మోదీకి మరోసారి చూపించే సమయం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిపై విచారణ సంస్థలను ఉసగొల్పుతున్నట్లు ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి కేసీఆర్ తలొగ్గలేదనే కవితను అరెస్ట్ చేయించారని ఎమ్మెల్సీ నవీన్ అన్నారు.
-సిటీబ్యూరో, మార్చి 16 ( నమస్తే తెలంగాణ )