నగరవ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళనాలు జోరందుకున్నాయి. వారం రోజుల క్రితం మొదలైన ఆత్మీయ సంబురాలు వచ్చే నెల 24 వరకు నిర్వహించనున్నారు. పార్టీ ఆత్మీయ సమావేశాల్లో పార్టీ ఇన్చార్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్నగర్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్
నాచారంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో జరిగిన ఉప్పల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి