సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ): గులాబీ పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తున్నది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో మరింత రెట్టింపు ఉత్సాహం నెలకొంది. గడిచిన కొన్ని రోజులుగా రజతోత్సవం నేపథ్యంలో సన్నాహక సమావేశాలతో నియోజవర్గాలను గులాబీ మయం చేసి హోరెత్తించారు. ఈ క్రమంలోనే ఎల్కతుర్తి సభకు భారీగా శ్రేణులు తరలివెళ్లారు.
పాతకేళ్ల పార్టీ ప్రస్థానం, పదేండ్ల పాలన, 16 నెలల కాంగ్రెస్ పాలన లోపాలపై కేసీఆర్ ప్రసంగించిన తీరును శ్రేణులను ఆకట్టుకున్నది. భవిష్యత్ పార్టీ కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ఇదే జోష్తో మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్య నేతలు, శ్రేణులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ప్రసంగంతో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లిన వాహనాలతో వరంగల్ హైవే గులాబీమయంగా మారింది. ఆదివారం ఉదయం నుంచి నగరంలోని నలుమూలల నుంచి వచ్చిన వాహనాలు ఉప్పల్ చౌరస్తా మీదుగా వరంగల్లో హైవేలోకి ప్రవేశించాయి. సభకు వెళ్లే వాహనాలతో ఉప్పల్ నుంచి భువనగిరి వరకు వాహనాలు బారులు తీరాయి. ఎటూ చూసిన హైవేపై జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. వివిధ ప్రాంతాల నుంచి ఈ రూట్లో వరంగల్ సభవేదిక వద్దకు ప్రయాణం సాగించిన పార్టీ శ్రేణులు సాధారణ వాహనదారులకు ఎక్కడికక్కడ రూట్ క్లియర్ చేస్తూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.వేల సంఖ్యలో వాహనాలతో ఈ హైవే కిక్కిరిసిపోవడంతో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదుల్తూ వెళ్లాయి.
మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి నేతృత్వంలో వేలాది సంఖ్యలో వాహనాలు, కార్లలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లారు. ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచే వరంగల్కు వాహనాలు తరలాయి. జిల్లా నుంచి సుమారు 50 వేల మంది తరలివెళ్లినట్లు బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు
కార్యకర్తలతో కలిసి బస్సులో వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా నేత నివేదిత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
అత్తాపూర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి రజతోత్సవ సభకు వెళ్తున్న రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్రెడ్డి
జై కేసీఆర్ అంటూ బస్సులో సభకు తరలివెళ్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలు
వివేకానంద నగర్ నుంచి ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
పద్మారావు నగర్లో జెండా ఊపి సభకు వెళ్లే బస్సులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్
ఎల్బీనగర్ నుంచి కార్లలో ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
బౌద్ధ నగర్ డివిజన్లో జెండా ఊపిరి ర్యాలీ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పద్మారావు గౌడ్