బంజారాహిల్స్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ నేత కాటూరి రమేష్తో పాటు పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్(BRS) లో చేరారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్(Mla Nagendar) సమక్షంలో వీరంతా బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ (Congress) ఎస్సీ సెల్ అధ్యక్షుడు భవానీ రమేష్, ఖైరతాబాద్ నియోజకవర్గం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పెండ్యాల విజయలక్ష్మి, ఏ-బ్లాక్ అధ్యక్షురాలు కవిత, సీనియర్ నాయకులు శ్యామ్నాయుడు, గౌస్, నాగార్జున, అంజమ్మ, ప్రభావతి తదితరులున్నారు.
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపు లేకపోవడంతో పాటు అనేక రకాలైన అవమానాలు ఎదురవుతుండడడంతో పార్టీకి రాజీనామా చేశామని కాటూరి రమేష్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ విజయం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మామిడి నర్సింగరావు, నగేష్ సాగర్, రవినాయక్,ఆకులరాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.