Maganti Gopinath | బంజారాహిల్స్,ఏప్రిల్ 7: సికింద్రాబాద్ ఎంపీగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిన కిషన్రెడ్డికి మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ సమావేశం ఆదివారం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో నిర్వహించారు.
నియోజకవర్గం ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు, దాసోజు శ్రావణ్కుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రధానమైన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందన్నారు.
గత ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా పనిచేసినా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదనే విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, పని చేయని కిషన్రెడ్డికి మరోసారి అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారన్నారు. మూడునెలల కిందటే బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడం ఆపార్టీ బలహీనతను సూచిస్తున్నదన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చలేక చేతులెత్తేసిందని ఆరోపించారు.
ఎక్కడ చూసినా మంచినీటి కష్టాలు, కరెంట్ కష్టాలు ఉన్నాయని, ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే బీఆర్ఎస్ కార్యకర్తలు పనిగా పెట్టుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో ప్రజలకు 20వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు వస్తున్నాయన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పద్మారావు గౌడ్ను ఎంపీగా గెలిపించుకునేందుకు బూత్స్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెల్దండ వెంకటేశ్, మన్నె గోవర్ధన్రెడ్డి, నాయకులు విప్లవ్కుమార్, ప్రసన్న రామ్మూర్తి, హేమలతయాదవ్, తాండ్ర మేఘన తదితరులు పాల్గొన్నారు.