మెహిదీపట్నం/సుల్తాన్బజార్, నవంబర్ 9 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించడానికి కృషి చేస్తానని నాంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీహెచ్ ఆనంద్కుమార్ గౌడ్ అన్నారు. గురువారం ఆనంద్కుమార్గౌడ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావుతో కలిసి నామినేషన్ను దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన తన ఇంటి నుంచి నాంపల్లి యూసుఫియన్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పటేల్ బాడ్లో ఉన్న ఏడుగుళ్ల పోచమ్మ ఆలయంలో పూజలు చేసి పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేసేందుకు ర్యాలీ గా బయల్దేరి వెళ్లారు. అనంతరం కార్యాలయంలో ఎన్ని కల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.
కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ ప్రదీప్కుమార్ అగర్వాల్,సీనియర్ నాయకులు సీహెచ్ దుర్గా ప్రసాద్గౌడ్, అబ్దుల్ ఖలీం,సి.సంజయ్, మురళీధర్, ప్రియాంక గౌడ్, నరేందర్ బిల్లం, మహ్మద్ యూసుఫ్, పార్టీ డివిజన్ల అధ్యక్షుడు మెట్టు నటరాజ్, చెన్నబత్ని లక్ష్మీనారాయణ, జకీఉల్లాఖాన్, మహ్మద్ అహ్మద్ అలీ, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.