బీసీలపై కాంగ్రెస్ పార్టీ కత్తి దూస్తున్నది. ఆ పార్టీ నేతల దురహంకార మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దమ్ముంటే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న కాంగ్రెస్ నేతలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెబుతామని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. చేవెళ్ల ఎంపీ స్థానంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాల్సిన సమయం వచ్చిందని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీసీలకు టికెట్ల కేటాయింపులో వివక్ష చూపడమే కాకుండా..బీసీలను అణగదొక్కేందుకు కాం గ్రెస్ నేతలు చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో తిప్పికొట్టాలని నేతలు పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ బీసీల సాధికారతకు పాటుపడుతున్నదని, ఆ పార్టీ అవకాశం కల్పించిన బీసీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకుని తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే బీసీలు గోస పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో అందరూ సంఘటితమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, బీసీలంతా ఏకమై.. సత్తాచాటి అగ్రవర్ణాల నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెబుదామని పిలుపునిస్తున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)
కొన్నేండ్లుగా బీసీలు రాజకీయంగా వెనుకబడి పోతున్నారు. జనాభాలో బీసీల సంఖ్య అధికంగా ఉన్నా.. పాలకుల్లో మాత్రం తక్కువగా ఉన్నది. బీసీలందరూ సమష్టిగా కృషి చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఆయన బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
– రమేశ్, నాయీబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు, వికారాబాద్
బీసీలపై అగ్రవర్ణ నాయకుల వ్యాఖ్యలు సమంజసం కావు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. బీసీలను అవమానపర్చేలా చులకనగా మాట్లాడడం తగదు. అగ్రవర్గాల వారికి తగిన బుద్ధి చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుని మన సత్తా చాటాలి.
– వెంకటేశ్, దాచారం, వికారాబాద్
96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయం. ఇప్పటివరకు చేవెళ్ల పార్లమెంట్లో బీసీలకు ఎంపీ టికెట్ దక్కలేదు. కేసీఆర్ బీసీలను గుర్తించి కాసానికి ఎంపీ టికెట్ కేటాయించడం హర్షణీయం. కులమతాకు అతీతంగా కారు గుర్తుకు ఓటేసి కాసానిని గెలిపించుకుందాం.
– రవికాంత్, ముదిరాజ్ సంఘం తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడు
రానున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను చేవెళ్ల నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారు. అలాంటి వారు పార్లమెంట్లోకి వెళ్తే పేదల సమస్యలు పరిష్కరమవుతాయి. బీసీలందరూ కాసానికే ఓటేయాలి.
– గుర్రంపల్లి యాదగిరి, అత్తాపూర్, బండ్లగూడ
బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది. బీసీలను కించపరిచేలా మాట్లాడిన మోహన్రెడ్డి లాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. పార్టీలకతీతంగా ఏకమై మన సత్తాను చాటుదాం..
– పటేల్ జగదీశ్వర్, వీరశైవ సమాజం నియోజకవర్గ అధ్యక్షుడు, పరిగి
బీసీల్లో ఇప్పుడిప్పుడే ఐక్యత వస్తున్నది. పాలకులు విభజించి పాలించడంతో ఐక్యత లోపించింది. బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
– ముకుంద నాగేశ్వర్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, పరిగి
కాసాని గెలుపు.. బీసీల అభివృద్ధికి మలుపు. బడుగు, బలహీన వర్గాల నాయకుడు జ్ఞానేశ్వర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ టికెట్ ఇవ్వడం అభినందనీయం. పార్టీల కతీతంగా బీసీలందరం ఏకమై గెలిపించుకోవాలి. అధికారం, స్వార్థం కోసం పార్టీలు మారిన కొండా విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలను ఓడించాలి. కాసానిని పార్లమెంట్కు పంపిద్దాం.
– వీణ, మాజీ చైర్పర్సన్, తాండూరు మార్కెట్ కమిటీ
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి గత 45 ఏండ్లుగా కాసాని జ్ఞానేశ్వర్ కృషి చేస్తున్నారు. ఆయన్ను రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిపించుకుంటే బీసీలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఆరు ఎంపీ సీట్లు కేటాయించడం చాలా సంతోషకరం. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలమంతా ఏకమై చేవెళ్ల ఎంపీగా కాసానిని గెలిపించుకుందాం..
– మద్దూరి పాండు, బీసీనేత, షాబాద్ మండలం
96 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప నేత కాసాని జ్ఞానేశ్వర్. అలాంటి వ్యక్తికి కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా అవకా శం కల్పించడం చాలా సంతోషకరం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలమంతా ఏకమై కాసానిని భారీ మెజార్టీతో గెలిపించి మన సత్తా ఏమిటో చూపాలి.
– దొనికెల రాందేవ్యాదవ్, బీసీ నాయకుడు షాబాద్
బీసీలపై అహంకార పూరితంగా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు, నేతలకు తగిన బుద్ధి చెప్పాలి. అందుకోసం రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి మన సత్తా, ఐక్యతను చాటాలి. బీసీలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని చూపాలి.
– ఆంజనేయులు, పద్మశాలీ సంఘం గౌరవాధ్యక్షుడు, ఆల్విన్ కాలనీ డివిజన్
కాంగ్రెస్ నాయకులు బీసీ ఓటర్లపై అహంకార పూరితంగా మాట్లాడడం సమంజనం కాదు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని బీసీలందరూ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మన సత్తా ఏమిటో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న నాయకులకు చూపాలి. దురహంకార మాటలు మాట్లాడే వారికి తగిన బుద్ధి చెప్పాలి.
-తిరందాసు విష్ణు, బీసీ నేత, ఆల్విన్ కాలనీ డివిజన్
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల సత్తా చాటుతాం. కారు కూతలు కూస్తున్న మోహన్ రెడ్డి లాంటి వారికి తగిన గుణపాఠం చెప్తాం. బీసీలను చులకన చేసి మాట్లాడిన వారికి తాము ఏంటో చూపిస్తాం. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీసీ కులాల సభ్యులంద రం ఏకమై కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.
– దశరథ, ముదిరాజ్ సంఘం నాయకుడు, వెంకటాపూర్, బడంగ్పేట
బీఆర్ఎస్ పార్టీ బీసీ ఉద్యమ నేత కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడం హర్షణీ యం. పార్టీలకతీతంగా అతడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీపైనా ఉన్నది. బీసీల్లో ఉన్న 96 కులాల ఐక్యతకు కాసాని ఎంతో కృషి చేశారు. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్ ఇచ్చేందుకు ముందుకు రాదు. బీసీలపై అడ్డదిడ్డంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం.. మోహన్రెడ్డి.. తస్మాత్ జాగ్రత్త .. బీసీల సత్తా చూపుతాం..
-పెండ్యాల ఉమేశ్కుమార్, రాష్ట్ర వృత్తి దారుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
బీసీల ఓట్లు లేనిదే ఏ నాయకుడూ ఎన్నికల్లో విజయం సాధించలేడు. సోషల్ మీడియా సాక్షిగా మోహన్రెడ్డి బీసీలను హేళన చేస్తూ మాట్లాడడం సమంజసం కాదు. బీసీ ఓటరు లారా.. ఇకనైనా మేల్కొని బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్ను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుని మన ఐక్యతను చాటాల్సిన సమయం వచ్చింది. లేకపోతే అగ్రవర్ణాల వారు చేస్తున్న ఆరోపణలు నిజమవుతాయి.. అరిగోస తప్పదు.
– చంద్రశేఖర్గౌడ్, బీసీ సంఘం నాయకుడు, బండ్లగూడ