హైదరాబాద్ : రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసనలు చేపట్టారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాలను విలీనం ఎలా చేస్తారు అంటూ బీఆర్ఎస్ శ్రేణుల ప్రశ్నించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తక్షణమే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజాభిప్రాయం సేకరించాలని డిమాండ్ చేశారు. కాగా, ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మూడు ముక్కలు చేసింది.
విశ్వనగరం ఆకాంక్షను ధ్వంసం చేసింది. శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసే క్రమంలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా, దేశంలోని అతిపెద్ద మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ బీరాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఉన్నదానిని విచ్ఛిన్నం చేశారు. నగర అభివృద్ధికి బ్రేకులు వేశారు. పాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లుగా విభజన అని చెప్తున్నా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఐటీ, ఫార్మా, రియల్ ఎ స్టేట్ రంగాల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన హైదరాబాద్ నగరాన్ని రూపురేఖలు లే కుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.