వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 13: అగ్రి వర్సిటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అగ్రివర్సిటీ కళాశాల ఆవరణలో విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.
విద్యార్థులు అధైర్యపడవద్దని..అండగా ఉంటామని అభయమిచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. రెండింతలు ైస్టెఫండ్ పెంచుతామని చెప్పారు. అనంతరం విద్యార్థి నాయకులను ఫోన్లో కేటీఆర్తో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులకు భరోసానిచ్చారు. యూనివర్సిటీ పరిపాలన నుంచి పీజీ, పీహెచ్డీ విద్యార్థుల ైస్టెఫండ్ పెంపును ఆమోదించి..అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
విద్యార్థి నేత రాజ్ కుమార్, యూనివర్సిటీ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్కుమార్, కార్యదర్శి మనోజ్ కుమార్ గౌడ్, లోకేశ్ ముదిరాజ్, వర్కింగ్ కమిటీ సభ్యులు మౌనిక, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. దీక్షకు కళాశాల విద్యార్థులతో పాటు , ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అంతకుముందు కళాశాల మూడో అంతస్తుకు విద్యార్థి నాయకులు చేరుకొని ‘మా చావుతోనైనా..వర్సిటీ సమస్యలు పరిష్కరించాలి’ అని నినాదాలు చేశారు.