Dasoju Srravan | తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం పట్ల బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమైన చర్య అని అన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని.. తొలగించలేదని దాసోజు శ్రవణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీగానీ.. కేసీఆర్ ప్రభుత్వం గానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అని మండిపడ్డారు. జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విగ్రహం ధ్వంసం చేసిన చోటులో మళ్లీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్ సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్లను ఆయన కోరారు.
It is a serious crime to demolish the statue of #Telangana Ideologue #ProfJayaShankar Garu who sacrificed his entire life to achieve Telangana Statehood.
It is an attack on Telangana pride and self respect..Even after the formation of Telangana, no statue of Andhra Leaders or… https://t.co/IdOLu4DGNt
— Prof Dasoju Srravan (@sravandasoju) January 16, 2024
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానే గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act
Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj
— KTR (@KTRBRS) January 16, 2024
అసలేం జరిగింది?
హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మహవీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంగళవారం ఉదయం అల్విన్ కాలనీ చౌరస్తాకు వచ్చాడు. అక్కడే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కింద పడేశాడు. అనంతరం ఓ రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు గోవింద్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనను స్థానికులు వీడియో తీయగా కాసేపటికే అది వైరల్గా మారింది.