ఖైరతాబాద్, జూన్ 18: బస్తీలో వీధి దీపాలు లేవు…చెత్త పేరుకుపోయినా తీయడం లేదు.. ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మలను తొలగించడం లేదంటూ బాలపుర బస్తీవాసులు బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి ఎదుట తమ సమస్యలను ఏకరువుపెట్టారు. బీఆర్ఎస్ సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా గురువారం ఎర్రమంజిల్ డివిజన్ పరిధిలోని బాలపుర బస్తీని ఆయన సందర్శించారు. స్థానికుల సమస్యలను సానుకూలంగా విన్న గోవర్ధన్రెడ్డి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీలో రోజురోజుకు సమస్యలు పేరుకుపోతున్నాయని.. అయినప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస నాయకులు శ్రీనివాస్, విష్ణు, మురళీ, అరుణ్, బలరాం, మదన్, సాయిలు, ధర్మేంద్ర, రావుల జగన్ తదితరులు పాల్గొన్నారు.