“ప్రతి హామీని నెరవేర్చాం.. ప్రతి పనిని పూర్తి చేశాం. స్వరాష్ర్టాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా మార్చాం. ఎన్నో సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపాం. అధికారమే పరమావధిగా ప్రతిపక్షాలు నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని” బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. గురువారం బేగంపేట డివిజన్ ఫంక్షన్ విల్లా, కంటోన్మెంట్ పద్మశాలి కల్యాణమంటపం, అబిడ్స్లోని మంగళ్హాట్ డివిజన్లో ఘనంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానాలు నిర్వహించారు. ఈ సమ్మేళనాల్లో మంత్రి తలసాని, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపుతూ నిధులు విడుదల చేయడం లేదన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతూ రాష్ర్టాల నోట్లో మట్టి కొడుతున్నారని వివరించారు. బీజేపీ కుళ్లు రాజకీయాలకు చరమగీతం పాడుతూ.. బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు.
కంటోన్మెంట్, ఏప్రిల్ 13: బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. కంటోన్మెంట్లోని పద్మశాలి కల్యాణమండపంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు నళినికిరణ్ ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత, హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణను దేశానికే తలమానికంగా మార్చారని అన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వకపోయినా.. కేసీఆర్ కుటుంబంపై విషం కక్కడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని పథకాలను దేశమంతా అమలు చేయాలని సవాల్ విసిరారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదో ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ అమలు అవుతున్నాయో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని.. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం కేసీఆర్కు జనమే బలం, బలగమని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరికీ వివరించాలని కోరారు. కంటోన్మెంట్ను పట్టించుకోవాల్సిన కేంద్రం గాలికొదిలేసిందని మండిపడ్డారు.
గులాబీ జెండా సామాన్యులకు అండగా మారిందని.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నగేశ్, మన్నె క్రిషాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండటం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. సాగును సుసంపన్నం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇవి దేశంలో ఎక్కడా అమలు కావడం లేవన్నారు. ఒక్క అబద్ధాన్ని బీజేపీ నేతలు వందల సార్లు ప్రచారం చేస్తారని.. వీటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలన్నారు. ఈ సమ్మేళనంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, భాగ్యశ్రీ, ప్రభాకర్, నేతలు శ్రీ గణేష్, శ్రీనివాస్, మధుకర్, కృష్ణ, ప్రవీణ్, సురేష్, శ్రీకాంత్, నర్సింహ,సంతోష్ , సృజన్,శేఖర్, మురళీ, భాస్కర్, శ్యామ్రెడ్డి పాల్గొన్నారు.