సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఎస్ఓసీనెట్ సౌత్ ఆసియా నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్(ఎన్ఎస్డీ), రీజినల్ కో ఆర్డినేటర్ రిచర్డ్ ఇయాన్ పగ్-కుక్, హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్లో ఏపీ, టీఎస్ రాజకీయ ఆర్థిక సలహాదారు నళినీ రఘురామన్ బుధవారం తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీఎస్పీఐసీసీసీ)ని సందర్శించారు.
అనంతరం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ వారికి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, సిటీ పోలీస్ అమలు చేస్తున్న ప్రజా భద్రత, సాంకేతికపరమైన అంశాల గూర్చి వివరించారు. భద్రత పరమైన సవాళ్లను పరిష్కరించడంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రతినిధులు ప్రశంసించారు. నగర భద్రత, భద్రతను పెంపొందించడంలో అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని వారికి వివరించారు.