మాదాపూర్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్లో ఫలహారం బండిని ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమానికి స్థానిక విప్ అరెకపూడి గాంధీ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.