హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఆదివారం జరిగే లష్కర్ బోనాల్లో పాల్గొనాలని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. గురువారం తన కుమారుడు రామేశ్వర్గౌడ్తో కలిసి ప్రగతిభవన్లో సీఎంను కలిసిన పద్మారావు, బోనాల సందర్భంగా తన నివాసం వద్దగల ముత్యాలమ్మ ఆలయంలో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. రెండు దశాబ్దాలుగా ఏటా ఉజ్జయినీ మహంకాళి దేవాలయం బోనాల వేడుకల్లో పాల్గొన్న అనంతరం సికింద్రాబాద్లోని పద్మారావుగౌడ్ ఇంట్లో విందుకు హాజరు కావడం కేసీఆర్కు ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎంను పద్మారావు ఆహ్వానించారు.