సైదాబాద్: యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీలోగల ఈదమ్మ దేవాలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీఆర్ఎస్ పార్టీ యాకుత్పురా నియోజకవర్గం ఇంచార్జీ సామ సుందర్రెడ్డి, ఐఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నరెడ్డి, మహేందర్రెడ్డి, దిడ్డి వెంకటేశ్లు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బుచ్చయ్య, పున్నమి రాములు, శ్రీనివాస్, సంతోష్, మెట్టు భాస్కర్ రెడ్డి, కార్తీక్ గౌడ్, శివకుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.