Ashoka Hotel | మారేడ్పల్లి, ఫిబ్రవరి 27 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బుధవారం రాత్రి బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, చిరు వ్యాపార్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గుర్తు తెలియని ఓ అగంతకుడు నుంచి అశోక హోటల్లో బాంబు పెట్టామని కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సమాచారం అందుకున్న గోపాలపురం ఇన్స్పెక్టర్ నరేష్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. హోటల్లో ఉన్న సిబ్బందిని, కస్టమర్లను బయటికి పంపించి డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో హోటల్లో ఏలాంటి బాంబు లేదని నిర్థారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని ఆకతాయి చేసిన పనిగా పోలీసులు తేల్చారు. కంట్రోల్ రూమ్కు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.