బోడుప్పల్, ఏప్రిల్ 5 : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ హుడాపార్కును సుమారు రూ.2.05కోట్ల నిధులతో 2.25 ఎకరాల్లో సుందరంగా తీర్చిదిద్దారు. కానీ నేడు నిర్వహణ లోపంతో పార్కు అధ్వానంగా మారింది. పార్కు పక్కనే ఉన్న ఆంజనేయనగర్ కాలనీ సమీప స్థలంలో మొక్కలు నాటి గాలికి వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని లక్ష్మీనగర్ హుడా కాలనీ అధ్యక్షుడు అమర లింగారెడ్డి కోరారు.
ఈ విషయంపై బోడుప్పల్ నగరపాలక సంస్థ డీఈ కురుమయ్యను వివరణ కోరగా.. లక్ష్మీనగర్ హుడా పార్కు సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. రూ.20లక్షల నిధులు ఖర్చు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, వారం పది రోజుల్లో నిర్వాహకుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు.