సుల్తాన్బజార్ : రక్త దానం ఎంతో మహోత్తరమైన కార్యక్రమమని ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఈ మేరకు టీ ఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ నేతృత్వంలో నిర్వహించిన 6వ మెగా రక్త దాన శిబిరాన్ని ఆమె ముఖ్య అతిధిగా విచ్చేసి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎంఎల్సీ మహ్మద్ సలీం, రాష్ట్ర మానవ హక్కుల కమిష న్ చైర్మన్ జస్టీస్ జీ చంద్రయ్యలతో కలిసి ప్రారంభించారు.
ఈ సంధర్భంగా రక్త దానం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత మంచి కార్యక్ర మాన్ని నిర్వహించిన ముజీబ్హుస్సేనీని ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు,అనంతరం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం ముజీబ్హుస్సేనీకే సాధ్యమయ్యింద న్నారు. తన తండ్రి పుట్టిన రోజు సంధర్భంగా తాను రక్త దానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ప్రతి ఒక్కరూ రక్త దానం చేయడం వలన సాటి మనిషి ప్రాణాలను కాపాడిన వారు అవు తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, ప్రధా న కార్యదర్శి రాయకంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు , ఉపాధ్యక్షులు ఉమాదేవి,కార్యదర్శి గరిగబోయిన చంద్రశేఖ ర్ తదితరులు పా ల్గొన్నారు.