మణికొండ,శంషాబాద్ రూరల్ : ప్రజల సంక్షేమమే తమ సంక్షేమమని భావించి నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీవితంలో అనేక పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్బంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ రెసిడెన్సీ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ విచ్చేసి రక్తదానం చేసిన వారిని అభినందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్త దానం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణరెడ్డి,బుద్దోలు శ్రీరాములు,పటోళ్ల రూప తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్లో….
కేసీఆర్ పట్టిన రోజు సందర్బంగా 24 వార్డు కౌన్సిలర్ కొనమల్ల భారతమ్మ ఆర్బీ నగర్, హుడా కాలనీలోని నిరు పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొనమల్ల శ్రీనివాస్,పరందాములు,భాస్కర్,సత్యం,సాయి,బాబా,సంజీవ,రాజు తదితరులు పాల్గొన్నారు.