అంబర్పేట/గోల్నాక/కాచిగూడ, జనవరి 19 : అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్వకంగా రెండో విడత కంటి వెలుగును చేపట్టిందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని రామకృష్ణనగర్ కమ్యూనిటీహాల్లో, కాచిగూడ విక్రమ్నగర్ కమ్యూనిటీహాల్లో, పటేల్నగర్ కమ్యూనిటీహాల్లో కంటి వెలుగు శిబిరాలను ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బి.పద్మవెంకటరెడ్డి, కన్నె ఉమారమేశ్యాదవ్, ఇ.విజయ్కుమార్గౌడ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన కంటి వెలుగు శిబిరాల ఏర్పాట్లను, కంటి అద్దాలు, మందులను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని, అందరికి పూర్తి సేవాభావంతో పరీక్షలు నిర్వహించాలని సంబంధిత వైద్యులు, సిబ్బంది, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్, నోడల్ అధికారి రజితారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా.కాలేరు దీప్తిపటేల్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్.చంద్రమోహన్, నాయకులు పాల్గొన్నారు.
గోల్నాక : సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు, బస్తీ దవాఖానలు, టీ డయాగ్నస్టిక్స్ కేంద్రాలు, మెడికల్ కాలేజీలు, కొత్త దవాఖానల ఏర్పాటుతో రాష్ట్రం దూసుకుపోతూ సామాన్య ప్రజలకు అవసరమైన ప్రతి పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. గురువారం అంబర్పేట మున్సిపల్ మైదానంతోపాటు పటేల్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావతి వెంకట్రెడ్డి తదితరులతో కలిసి ఆయన రెండో విడత కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ వేణుగోపాల్, ఏఎంహెచ్వో జ్యోతిబాయితో పాటు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, అంబర్పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్, నాయకులు పాల్గొన్నారు.
– దేశానికే కంటి వెలుగు పథకం ఆదర్శంగా నిలుస్తుందని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం గోల్నాక డివిజన్ కమలానగర్లో కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
కాచిగూడ : కంటి రహిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ప్రతి మనిషికి కళ్లు ముఖ్యమైనవని, కళ్లను అశ్రద్ధ చేయవద్దని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం బర్కత్పురలోని విక్రమ్నగర్ వార్డు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని చూడడానికి ప్రతి మనిషికి కళ్లు అతి ముఖ్యమైనవని, వాటిని నిర్లక్ష్యం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, ఇన్చార్జి డాక్టర్ శిరీషాయాదవ్, జీహెచ్ఎంసీ డీఎంసీ వేణుగోపాల్, ఏఎంఓహెచ్ జ్యోతిబాయి, కంటివెలుగు ఇన్చార్జి డాక్టర్ మనోజ్రెడ్డి, డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం ఆహ్వానం మేరకు కంటి వెలుగు, సమీకృత జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలకు వచ్చామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన పార్టీ నాయకులతో చెప్పినట్లు అంబర్పేట నియోజకవర్గం కన్వీనర్ డా.హరిప్రసాద్ తెలిపారు. కేజ్రీవాల్ను కలిసిన వారిలో ఆ పార్టీ నియోజకవర్గం కోకన్వీనర్ పుట్ట పాండురంగయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వికాస్రెడ్డి, జాయింట్ సెక్రటరీలు శ్రీనివాస్, శ్రీనివాస్, పూర్ణచందర్రావు తదితరులున్నారు.