వ్యవసాయ యూనివర్సిటీ : నిరు పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు . మంగళవారం తన కార్యాలయంలో బాధితుడు చింతల్ మెట్ కు చెందిన విష్ణుకు రూ.2 లక్షల చెక్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్నా పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు .
దీనిద్వారా నిరు పేదలు కూడా మంచి కార్పోరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సులేమాన్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు షేక్ నయూమోద్ధీన్, షేక్ బాబ, హుస్సేన్ , ఫయాజ్ ఖాన్ , విష్ణు తదితరులు పాల్గొన్నారు .