ఉప్పల్, మే 21: బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు ఆయుష్ వైద్య విధానంలో చికిత్స ఉందని ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలగు వర్షిణి అన్నారు. రామంతాపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కళాశాలలో ఆయుష్ మందు లు, బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణపై శుక్రవారం ఆమె మాట్లాడారు. బ్లాక్ ఫంగస్కు హోమియో వైద్య విధానంలో మందులున్నాయని తెలిపారు. కొవిడ్ చికిత్సలో అల్లోపతిలో అధికంగా స్టెరైడ్స్ వాడటం, మధుమేహం నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నా రు. కొవిడ్ నుంచి కోలుకుంటున్నవారు, మధుమేహం నియంత్రణలేనివారు హోమియోపతి మందులు వాడటం, తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులు కావొచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు లింగరాజు, శ్రీదేవి, శ్రీనివాస్రెడ్డి, పార్ధసారధి, రజని పాల్గొన్నారు.