శంషాబాద్ రూరల్, నవంబర్ 8: బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్టుకాలనీకి చెందిన బీజేపీ నాయకుడు శ్రావణ్గౌడ్తో పాటు పలువురు నాయకులు, యువకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ గణేశ్ గుప్తా, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, కౌన్సిలర్ అమృతారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువత
బండ్లగూడ, నవంబర్ 8: అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యువత పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తుందని.. ఉద్యోగాల కల్పనతో పాటు అనేక పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్గౌడ్, మలాకి రత్నం, కార్పొరేటర్ అస్లాంబిన్ అబ్దుల్లా, బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజు, నాయకులు చేగూరి రాజు, విష్ణువర్ధన్రెడ్డి, జయరాజ్, శశికుమార్, అక్షయ్కుమార్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
మరోసారి బీఆర్ఎస్ విజయం
మైలార్దేవ్పల్లి, నవంబర్ 8: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. మైలార్దేవ్పల్లి డివిజన్లోని భవన బుషి కాలనీలో టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్కు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వినోద్, నర్సింగ్, సత్యం, శివ తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం ప్రజా సేవలో..
మైలార్దేవ్పల్లి, నవంబర్ 8: బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజా సేవలోనే ఉంటుందని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు. బుధవారం మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్త్రత సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని.. కార్యకర్తలే పార్టీకి పునాదులని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్, కాశీగారి యాదగిరి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జోరుగా ఇంటింటి ప్రచారం..
మణికొండ, నవంబర్ 8: రాజేంద్రనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మణికొండ, నార్సింగి, బండ్లగూడ, శంషాబాద్ మున్సిపాలిటీల పరిధిలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ పార్టీ మణికొండ మున్సిపాలిటీ సమన్వయకర్త తలారి మల్లేశ్ ముదిరాజ్, స్థానిక మున్సిపల్ ఫ్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీశ్రీ, రాష్ట్ర నాయకులు కొణతం లక్ష్మణ్గౌడ్, ఆల్కాలనీస్ సమాఖ్య అధ్యక్షుడు సీతారాం దూళిపాళ, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి తదితర నేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈదులకంటి మహేశ్, లక్ష్మయ్య, నరేందర్, బషీర్, నీలేశ్ప్రసాద్ దూబే, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి గ్రామాల్లో మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖాయాదగిరి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్యాదవ్, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
మంచిరేవుల గ్రామంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్ మేకల ప్రవీణ్యాదవ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పొన్న రమేశ్, పార్టీ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రవీణ్ముదిరాజ్, నాయకులు క్రాంతి కుమార్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు.
పెద్దషాపూర్, పెద్దషాపూర్తండా, మదన్పల్లి కొత్తతండా, బుర్జుగడ్డతండాల్లో శంషాబాద్ మండల అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ఎంపీపీ నీలంనాయక్, నీరటి రాజుముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్లు దవాణాకర్గౌడ్, బుర్కుంట సతీశ్, మంచర్ల మోహన్రావు, సర్పంచ్లు దేవానాయక్, వట్టెల సతీశ్యాదవ్, నీలనాయక్, మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, రామునాయక్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
మైలార్దేవ్పల్లి, నవంబర్ 8: బాబుల్రెడ్డినగర్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షుడు టి.ప్రేమ్గౌడ్ ప్రజలకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ.. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎస్.వెంకటేశ్, సోమ శ్రీను, కాశీగారి యాదగిరి, రమణ, కిష్టప్ప, ప్రసన్న, హన్మంతు, లక్ష్మణ్, కిశోర్, రవి, సందీప్, వి.మల్లేశ్, అశోక్, బాలరాజ్, దినేశ్, శ్రీను, బస్వారాజ్, రమేశ్, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ, నవంబర్ 8: ఎర్రబోడలో బీఆర్ఎస్ అధ్యక్షుడు ధర్మారెడ్డితో కలిసి రాజేంద్రనగర కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలుపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రామాచారి, సుమలత, మహేశ్, యాదమ్మ, సుజాత, ఎం.ప్రభాకర్రెడ్డి, సూర్య ప్రకాశ్రెడ్డి, దేవదాసు, రాజుగౌడ్, రజనీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శివాజీనగర్ బస్తీలో బీఆర్ఎస్ పార్టీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరామ్రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. చెరుకు అమరేందర్, శ్రీనివాస్గౌడ్, మోహన్రెడ్డి, శివకుమార్, భరత్సారంగి, మహేశ్ముదిరాజ్, జైహింద్రెడ్డి, శంకర్, మారుతీరావు, సిద్ధు, సంతోష్, మల్లేశ్, కొమ్ము నర్సింహ పాల్గొన్నారు.
అత్తాపూర్ భాగ్యనగర్ కాలనీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిద్దెల సురేందర్రెడ్డి, సురేశ్రెడ్డి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.మధు, సత్తిరెడ్డి, పీఎం.రెడ్డి, ముకేశ్, అప్పారెడ్డి, పి.గౌరీశంకర్, మల్లేశ్యాదవ్, శేఖర్, అర్జున్రెడ్డి, మహేశ్, శివరెడ్డి, పి.నరేందర్రెడ్డి, కృష్ణా, ఏ.రవి తదితరులు పాల్గొన్నారు.